అభివృద్ధి జరుగుతుందంటే రాజీనామాకు సిద్ధం: ఎంపీ వెంకట్రెడ్డి
తన రాజీనామాతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని హామీ ఇస్తే తానూ రాజీనామాకు సిద్ధమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం ఆయన
భువనగిరి పట్టణం, నల్గొండ పురపాలిక: న్యూస్టుడే: తన రాజీనామాతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని హామీ ఇస్తే తానూ రాజీనామాకు సిద్ధమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం ఆయన భువనగిరిలో, నల్గొండలో విలేకరులతో మాట్లాడారు. మునుగోడులో ఉపఎన్నిక రానుండటంతోనే నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న పది లక్షల ఆసరా పింఛన్లను ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్లో దళితబంధును రూ.200 కోట్లతో అమలు పరుస్తామని మాట ఇచ్చి మరిచారని, నేటికీ బీసీబంధు అమలు చేయలేయడం లేదని మండిపడ్డారు. మునుగోడులో పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.90 కోట్లు చెల్లించని కారణంగా రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైలు సదుపాయం సమకూరలేదని ఆరోపించారు. తెలంగాణ వాటా చెల్లిస్తే రూ.500 కోట్లతో ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ పూర్తయ్యేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్