జాతి నాయకుల విగ్రహాలకు కాంగ్రెస్‌ నేతల నివాళి

స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్‌ నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని జాతి నాయకుల విగ్రహాలకు నివాళులర్పించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

Published : 18 Aug 2022 05:51 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్‌ నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని జాతి నాయకుల విగ్రహాలకు నివాళులర్పించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, నేతలు మహేశ్వర్‌రెడ్డి, వి.హనుమంతరావు,  ఎం.కోదండరెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌, తదితరులు మహాత్మాగాంధీ(సికింద్రాబాద్‌), అల్లూరి సీతారామరాజు(ట్యాంక్‌బండ్‌), పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ(అబిడ్స్‌), సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌(అసెంబ్లీ ఎదురుగా), టంగుటూరి ప్రకాశం పంతులు (అసెంబ్లీ ఎదురుగా), ఇందిరాగాంధీ(నక్లెస్‌ రోడ్‌), డా.రాజేంద్రప్రసాద్‌ ( చాదర్‌ఘాట్‌, పోలీసుస్టేషన్‌ ఎదురుగా) విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని