కాంగ్రెస్, భాజపాలకు ఓట్లడిగే హక్కు లేదు: జగదీశ్రెడ్డి
కాంగ్రెస్, భాజపాలు మునుగోడు ప్రజలకు ద్రోహం చేశాయని, వాటికి ఓట్లు అడిగే హక్కే లేదని విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం
ఈనాడు, హైదరాబాద్: కాంగ్రెస్, భాజపాలు మునుగోడు ప్రజలకు ద్రోహం చేశాయని, వాటికి ఓట్లు అడిగే హక్కే లేదని విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా మునుగోడు ప్రగతి దెబ్బతిందన్నారు. అదే వ్యక్తిని రంగంలోకి దించడం ద్వారా నియోజకవర్గాన్ని మరింత నష్టపరిచేందుకు భాజపా సిద్ధమైందని మంత్రి విమర్శించారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థికే పట్టం కట్టడం ఖాయమన్నారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్పర్తి పాడి ఉత్పత్తిదారుల సొసైటీ ఛైర్మన్ చీమల వరుణ్యాదవ్, పంచాయతీ మాజీ సభ్యుడు ఈరటి శ్రీశైలం తదితరులు హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డి నివాసంలో తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..