జనవరి 27 నుంచి పాదయాత్ర
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు తన పాదయాత్ర జనవరి 27న ప్రారంభించనున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్
మంగళగిరి, న్యూస్టుడే: కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు తన పాదయాత్ర జనవరి 27న ప్రారంభించనున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. నూతక్కిలో గురువారం రాత్రి జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘400 రోజులు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా. అందువల్ల నియోజకవర్గంలో ఉండటం లేదు. ఆ తర్వాత మిగిలిన మొత్తం రోజులు నియోజకవర్గంలోనే ఉంటాను. మంగళగిరిని కంచుకోటగా మార్చానని అనుకుంటున్నాను...’ అని పేర్కొన్నారు. తాను వచ్చే వరకు మంగళగిరికి కాపలా కాయాలని కార్యకర్తలకు లోకేశ్ సూచించారు. తనను ఓడించేందుకు జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి అన్ని ఆయుధాలు వాడతారని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. అందుకే నియోజకవర్గాన్ని తాను వచ్చే వరకు చూసుకోవాలని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్