జనవరి 27 నుంచి పాదయాత్ర

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు తన పాదయాత్ర జనవరి 27న ప్రారంభించనున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు.

Published : 26 Nov 2022 04:56 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు తన పాదయాత్ర జనవరి 27న ప్రారంభించనున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. నూతక్కిలో గురువారం రాత్రి జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘400 రోజులు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా. అందువల్ల నియోజకవర్గంలో ఉండటం లేదు. ఆ తర్వాత మిగిలిన మొత్తం రోజులు నియోజకవర్గంలోనే ఉంటాను. మంగళగిరిని కంచుకోటగా మార్చానని అనుకుంటున్నాను...’ అని పేర్కొన్నారు.  తాను వచ్చే వరకు మంగళగిరికి కాపలా కాయాలని కార్యకర్తలకు లోకేశ్‌ సూచించారు. తనను ఓడించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి అన్ని ఆయుధాలు వాడతారని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. అందుకే నియోజకవర్గాన్ని తాను వచ్చే వరకు చూసుకోవాలని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని