పట్టణ పేదలకు ఉపాధి హామీ తరహా స్కీమ్: కేంద్రమంత్రికి KTR వినతి
దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురీ, పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లు వారి ముందుంచారు.
దిల్లీ: గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని తెలంగాణ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. రాబోయే బడ్జెట్లో ఇందు కోసం ఓ పథకాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. దిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీతో శనివారం జరిగిన భేటీలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
రోజురోజుకూ పట్టణ జనాభా అంతకంతకూ పెరుగుతోందని, భవిష్యత్లో ఇది మరింత పెరగబోతోందని కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా నగరపాలక సంస్థలకు ఈ వ్యవహారం సంక్లిష్టంగా మారే అవకాశం ఉందన్నారు. అందుకే గ్రామీణ స్థాయిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉన్నట్లే పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కార్డులు జారీ చేసి నగర స్థాయిలో వారి సేవలను వినియోగించుకుంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-2 (బి) పనులకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఫేజ్-1లోని కారిడార్-3లో ఉన్న నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు విస్తరణకు నిధులు సమకూర్చాలని మంత్రిని కోరారు. లింకు రోడ్డుల నిర్మాణానికి నిధులు సమకూర్చాలన్నారు. వీటితో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్, హైదరాబాద్-వరంగల్ నడుమ వేగవంతమైన రవాణా వ్యవస్థ, శానిటేషన్ హబ్ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు.
పీయూష్ గోయల్తోనూ భేటీ
దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పురోగతిని వివరించడంతో దాని ప్రాధాన్యతను మంత్రికి వివరించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ధాన్యం పండుతోందని, కాబట్టి రాష్ట్రం నుంచి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ను సేకరించాలని కోరారు. కేటీఆర్తో పాటు ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా