కేరళ సీఎం విజయన్కు కరోనా
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా........
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. చికిత్స నిమిత్తం కొజికోడ్ వైద్య కళాశాలలో చేరనున్నట్టు తెలిపారు. ఇటీవల తనని కలిసి వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కుమార్తె వీణకు ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఈ నెల 6న జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పీపీఈ కిట్ ధరించి వచ్చిన ఆమె పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మార్చి 3న విజయన్ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు, కేరళలో గురువారం భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలోనే 63,901శాంపిల్స్ పరీక్షించగా 4353 కేసులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా ఎర్నాకులంలో 654 కొత్త కేసులు రాగా.. కోయ్కోడ్ 453, తిరువనంతపురం 234, త్రిస్సూర్ 393, మలప్పురం 359, కన్నూరు 334 చొప్పున కొత్త కేసులు నమోదైనట్టు కేరళ వైద్యశాఖ వెల్లడించింది. అలాగే, తాజాగా మరో 18మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు కొవిడ్ మృతుల సంఖ్య 4728కి పెరిగింది. కేరళలో ప్రస్తుతం 33,261 క్రియాశీల కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం