China incursions: భాజపా.. బీజింగ్ జనతా పార్టీలా మారింది: ఖర్గే
భారత్లోకి చైనా చొరబాట్ల అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేస్తున్నారంటూ.......
దిల్లీ: భారత్లోకి చైనా చొరబాట్ల అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేస్తున్నారంటూ మండిపడ్డారు. భాజపా ‘బీజింగ్ జనతా పార్టీ’గా రూపాంతరం చెందిందంటూ ట్విటర్లో ఆరోపించారు. అరుణాచల్ప్రదేశ్లో గ్రామాల్ని నిర్మించేందుకు అక్కడి భాజపా ప్రభుత్వం చైనాను అనుమతించిందని, అలాగే, బీజింగ్ విమానాశ్రయ చిత్రాలను యూపీలో నిర్మించనున్న కొత్త విమానాశ్రయంగా భాజపా ప్రభుత్వం చూపిస్తోందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. లద్దాఖ్లో మన భూభాగాన్ని చైనాకు అప్పగించేసిన భాజపా.. బీజింగ్ జనతా పార్టీగా మారిందని ఆరోపించారు. లద్దాఖ్, ఉత్తరాఖండ్తో పాటు తాజాగా అరుణాచల్ప్రదేశ్లో చైనా చొరబాట్లపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. డ్రాగన్పై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకొని తిరిగి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న