Atchannaidu: బీటెక్‌ రవికి భద్రత కల్పించండి.. డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

తెదేపా మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి భద్రత కల్పించాలంటూ డీజీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

Published : 30 Dec 2023 14:13 IST

అమరావతి: తెదేపా మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి భద్రత కల్పించాలంటూ డీజీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఈ నెల 29న బీటెక్‌ రవికి గన్‌మెన్లను తొలగిస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని కోరారు. 2006 నుంచి ఆయనకు భద్రత ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వాయ్‌పై కొందరు దాడి చేసినట్లు చెప్పారు. ఆయనకు ప్రాణ హాని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని