విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు: బొత్స

జల వివాదంపై రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తే తెలంగాణ నాయకులకు అక్కడి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నీటి కేటాయింపులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు.

Updated : 30 Jun 2021 14:58 IST

అమరావతి: జల వివాదంపై రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తే తెలంగాణ నాయకులకు అక్కడి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నీటి కేటాయింపులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ చేపడుతున్నామని.. త్వరలోనే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు ప్రారంభించి రైతులకు ప్లాట్లు అందిస్తామని వెల్లడించారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయన్నారు. జలాల అంశంపై కృష్ణా బోర్డుకు సహకరిస్తామన్నారు. ‘‘మా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చొలేదు. విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు ఉంటాయి. చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయి’’ అని బొత్స అన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని