Komatireddy: కేసీఆర్‌ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి

సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 29 Mar 2024 13:27 IST

హైదరాబాద్‌: సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్‌ చేసిన మొదటి తప్పు. అక్కడ అవినీతి జరిగింది. ఎన్నికల తర్వాత విచారణ చేపడతాం. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తాం. ఆయన చేసిన పాపాల వల్ల కరవు వచ్చింది. వర్షం అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే వర్షం. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు. 

గేట్లు తెరవకముందే కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారు. కేసీఆరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. నల్గొండ జిల్లాను ఆయన నాశనం చేశారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారు? అధికారులతో పాపపు పనులు చేయించారు. దీంతో వారిప్పుడు భయంతో నిద్రపోవడం లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. కేసీఆర్‌ ప్రతిదీ రాజకీయం చేశారు’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని