Roja-Nagababu: నాగబాబు వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్
సినీనటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
అమరావతి: తన శాఖ అభివృద్ధి గురించి సినీనటుడు, జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలని.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సరికాదన్నారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె ట్వీట్ చేశారు. ‘‘విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలి. నోటికి ఎంత వస్తే అంత వాగడం సరికాదు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం మీకే చెల్లుతుంది. ఏపీ గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు’’ అని రోజా పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందంటూ రోజాపై నాగబాబు విమర్శలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు.. అభివృద్ధి చేయడమని మంత్రి తెలుసుకోవాలన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్లపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘రోజా.. మీరు ఇన్ని రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు..’’ అని నాగబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రోజా స్పందిస్తూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?