ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండో సారి కరోనా

తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం...

Updated : 04 Dec 2020 05:16 IST

 

అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం  నెగిటివ్ వచ్చాక డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటతో విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో బచ్చుల అర్జనుడికి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని