Rahul Gandhi: అప్పుడు రాష్ట్రంలో చేసిందే ఇప్పుడు దేశంలో చేస్తున్నారు! మోదీపై రాహుల్ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు భారతదేశాలను సృష్టించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకటి ధనవంతులకు, మరొకటి పేదల కోసమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలోని వనరులను కొంతమంది సంపన్నులకు ధారాదత్తం...
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ రెండు భారతదేశాలను సృష్టించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకటి ధనవంతులకు, మరొకటి పేదల కోసమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలోని వనరులను కొంతమంది సంపన్నులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పార్టీ ప్రచారానికి శ్రీకారం చుడుతూ మంగళవారం దాహోద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ‘ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ’ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
‘2014లో మోదీ ప్రధాని అయ్యారు. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రంలో చేసిందే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అదే ‘గుజరాత్ మోడల్’ను అమలు చేయడం. ఈ క్రమంలో రెండు భారత్లను సృష్టిస్తున్నారు. ఒకటి ధనవంతులది. ఇందులో అధికారం, డబ్బున్న బ్యూరోక్రాట్లు, బిలియనీర్లు ఉన్నారు. రెండోది.. సామాన్య ప్రజలకు చెందినది' అని అన్నారు. భాజపా మోడల్లో.. గిరిజనులు, పేదలకు చెందిన భూమి, అటవీ, నీటి వనరులను కొందరికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ.. ఈ విభజనను కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వం గిరిజనుల హక్కులను హరించిందని విమర్శించారు.
‘గిరిజనులు తమ కష్టార్జితంతో గుజరాత్లో రోడ్లు, వంతెనలు, భవనాలు, మౌలిక వసతులు నిర్మించారు. కానీ.. వారికి నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు.. ఏదీ దక్కలేదు. భాజపా ప్రభుత్వం ఏం ఇవ్వదు. కానీ.. ప్రతిదీ లాక్కుంటుంది. కాబట్టి.. మీ హక్కులను మీరే సాధించుకోవాలి’ అని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా నిర్వహణలో వైఫల్యాలపైనా మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘కొవిడ్ సమయంలో.. గుజరాత్లో ఒకవైపు మూడు లక్షల మంది మరణించగా.. మరోవైపు చప్పట్లు కొట్టాలని, మొబైల్ టార్చ్ను ఫ్లాష్ చేయాలని పిలుపునివ్వడం గమనార్హం. మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 50 నుంచి 60 లక్షల మంది మృతి చెందారు’ అని విరుచుకుపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.