Ranjith Reddy: భారాసకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా

భారాసకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా భారాసకు రాజీనామా చేసినట్లు చెప్పారు.

Updated : 17 Mar 2024 13:09 IST

హైదరాబాద్: భారాసకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా భారాసకు రాజీనామా చేసినట్లు చెప్పారు. ‘‘చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చిన కేసీఆర్‌, కేటీఆర్‌కు ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారాసలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని రంజిత్‌రెడ్డి తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల ముందు ముఖ్యనేతలు భారాసను వీడుతుండటం ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ రాజీనామా చేశారు. శనివారం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్.. ఆదివారం భాజపాలో చేరారు. వీరితో పాటు మరికొంత మంది గులాబీ పార్టీని వీడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు