Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించడానికే ఏర్పాటు చేసిన సభలా ఉంది..
శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)ను చూసి భాజపా భయపడుతోందని ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) వ్యాఖ్యానించారు. నాందేడ్ సభ భాజపా అంతర్గత సభలా లేదని, ఉద్ధవ్ను విమర్శించేందుకు ఏర్పాటు చేసినట్లు ఉందన్నారు.
ముంబయి: శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)ను చూసి భారతీయ జనతా పార్టీ (Bjp) భయపడుతోందని ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్ర (Maharshtra)లోని నాందేడ్లో జరిగిన ‘మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో ఉద్ధవ్ను ఉద్దేశించి కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడటంపై సంజయ్ రౌత్ ట్విటర్ వేదికగా స్పందించారు.
‘‘నాందేడ్ సభలో అమిత్ షా 20 నిమిషాలు మాట్లాడితే.. అందులో 7 నిమిషాలు ఉద్ధవ్ ఠాక్రే గురించే మాట్లాడారు. అది భాజపా అంతర్గత సభలా లేదు.. ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించడానికే ఏర్పాటు చేసిన సభలా ఉంది. ఉద్ధవ్పై సంధించిన ప్రశ్నలను భాజపా మరోసారి సమీక్షించుకోవాలి. అలాంటి ప్రశ్నలడిగి భాజపా.. తను వేసిన వలలో తనే చిక్కుకుంది’’అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
కేంద్రంలో భాజపా (bjp) తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నాందేడ్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్ ఉండకూడదని భాజపా నమ్ముతుందన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రతిపక్ష నేత ఉద్ధవ్ ఠాక్రే తన వైఖరి ఏంటో చెప్పాలన్నారు. సొంత పార్టీని మోసం చేసి.. సీఎం పదవి కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు