Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్‌

జైలులో ఉండాల్సిన సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Published : 23 Sep 2023 11:29 IST

అమరావతి: జైలులో ఉండాల్సిన సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘జైలు మోహన్‌కు బెయిల్‌డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్.. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. రూ.42 వేల కోట్ల ప్రజాధనం దోచేశారు. జగన్‌పై సీబీఐ, ఈడీ సహా 38 కేసులు ఉన్నాయి. జైలులో ఉండాల్సిన ఆయన.. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని