BJP: భాజపా కీలక కమిటీ నుంచి గడ్కరి, చౌహాన్ ఔట్
భారతీయ జనతా పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు పునర్ వ్యవస్థీకరించారు.
ఫడణవీస్కు చోటు
ఇంటర్నెట్డెస్క్: భారతీయ జనతా పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్ వ్యవస్థీకరించారు. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బోర్డు నుంచి తొలగించారు. కొత్తగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె.లక్ష్మణ్లను తీసుకొన్నారు. ఈ బోర్డులో జేపీ నడ్డా (అధ్యక్షుడు), నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్ , కె.లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, బి.ఎల్. సంతోష్ ఉన్నారు.
ఇక భాజపా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా మార్పులు చేశారు. దీనిలో కొత్తగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కు స్థానం కల్పించారు. భాజపా కొత్త సీఈసీలో జేపీ నడ్డా (అధ్యక్షుడు), నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె.లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడణవీస్, ఓం మాథూర్, బీఎల్ సంతోష్, వనతి శ్రీనివాస్ ఉన్నారు.
ఈ రెండు కమిటీల్లో మోదీ సర్కారులో అత్యంత సీనియర్ మంత్రి గడ్కరీకి స్థానం దక్కకపోవడం గమనార్హం. మరోపక్క పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం విశేషం. కర్ణాటకలో ఆయనకు ఉన్న పట్టు కారణంగా పార్టీలో కేంద్ర కమిటీల్లో స్థానం దక్కించుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట