PSUల్లో రెండు లక్షల ఉద్యోగాలను తొలగించేశారు: రాహుల్
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను కనుమరుగు చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ (PSU)ల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను కేంద్రం తొలగించేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. తద్వారా లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. కొంత మంది ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే భాజపా (BJP) ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు.
పీఎస్యూ (PSU)లు ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా ఉండేవని రాహుల్ (Rahul Gandhi) అన్నారు. యువత ఉద్యోగాల కలకు అవి నెలవుగా ఉండేవని పేర్కొన్నారు. కానీ, నేడు ఆ పీఎస్యూ (PSU)లు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేనే లేవని దుయ్యబట్టారు. ‘‘పీఎస్యూల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండేవి. అవి 2022 నాటికి 14.6 లక్షలకు తగ్గాయి. ప్రగతిశీల దేశంలో ఉద్యోగాలు తగ్గుతాయా? బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు పోయాయి. సెయిల్లో 61,928 ఉద్యోగాలు, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,140, ఎఫ్సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు పోయాయి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన భాజపా ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలను తొలగించేసిందని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. పైగా వీటిలో కాంట్రాక్టు నియామకాలను రెండింతలు చేసిందని తెలిపారు. ఒప్పంద ఉద్యోగులను పెంచడం అంటే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కును హరించడం కాదా? అని ప్రశ్నించారు. కంపెనీలను ప్రైవేటుపరం చేయాలనే కుట్రేమైనా ఉందా? అని నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలను కనుమరుగు చేయడం.. ఇదేం ‘అమృత్కాల్’ అని ప్రశ్నించారు. పీఎస్యూల (PSU)కు తగిన ప్రాధాన్యం ఇస్తే ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని.. భారత వృద్ధి పథాన్ని సుగమం చేసేలా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా