Payyavula Keshav: ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించారా?: పయ్యావుల
ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
మంగళగిరి: ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించిన వారిని ఇలానే అరెస్టు చేసుకుంటూ పోతే రెండు సీట్లకే పరిమితమవుతారని హెచ్చరించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి ఎలా అరెస్టు చేస్తారు అని ప్రశ్నించారు.
‘‘వైకాపా ప్రభుత్వం వచ్చాక 2021లోనే సీమెన్స్ అద్భుత పనితీరు ప్రదర్శించిందని సర్టిఫికెట్ ఇచ్చారు కదా? ఒప్పందం ప్రకారం సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అన్ని అందాయని ఒకవైపు చెబుతున్నారు కదా? నిధులు పక్కదారి పట్టాయంటున్నారు.. మరి ఇంతవరకు నిరూపించలేకపోయారు ఎందుకు? కేవలం అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనేదే జగన్ కుట్ర. అక్రమ కేసులకు తెదేపా భయపడదు? రేపు రాజకీయ రణక్షేత్రంలో పదింతల శక్తితో ఎదుర్కొంటాం.
Chandrababu Arrest: సీఐడీ కస్టడీ పిటిషన్పై 18 వరకు విచారణ చేపట్టొద్దు: హైకోర్టు ఆదేశం
ప్రభుత్వం, సీమెన్స్, డిజైన్టెక్ ఒప్పందం చేసుకున్నాయి. సీమెన్స్ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదే? సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు? ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించగలిగారా? నాలుగేళ్లలో ఏ ఒక్కరోజైనా నోటీసు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు? ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఓటమి భయంతోనే తెదేపాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. నిజాలు వెలుగులోకి వస్తాయనే సీమెన్స్ను పక్కన పెడుతున్నారు’’ అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?