TDP-YSRCP: పేర్ని నాని ఫిర్యాదు.. అయ్యన్న, బుద్ధా వెంకన్నపై కేసులు

మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు పలువురు తెదేపా నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated : 25 Aug 2023 14:02 IST

అమరావతి: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు పలువురు తెదేపా నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా గన్నవరంలో నిర్వహించిన బహిరంగసభలో తెదేపా నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో పేర్ని నాని ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. అయ్యన్నపై 153A, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద.. బుద్దా వెంకన్నపై 153, 153A, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని