Mallikarjun Kharge: ఆ చారిత్రక వైఫల్యాన్ని ప్రధాని ఇంకా గుర్తించలేదు: ఖర్గే
ఆర్థిక పతనానికి కారణమైన నోట్ల రద్దులోని చారిత్రక వైఫల్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా గుర్తించలేదని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు.
ఇంటర్నెట్డెస్క్: ఆర్థిక పతనానికి కారణమైన నోట్ల రద్దులోని చారిత్రక వైఫల్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా గుర్తించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. భారత్లో పెద్ద నోట్లను రద్దు చేసి రేపటికి ఆరు ఏళ్లు. ఈ నేపథ్యంలో ఖర్గే మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రజల వద్ద ఉన్న నోట్ల విలువ రూ.30.88 లక్షల కోట్లకు చేరిందన్నారు. ‘‘దేశాన్ని నల్లధనం నుంచి విముక్తి చేయడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుందని వాగ్దానం చేశారు. కానీ, వ్యాపారాలు నాశనమై.. ఉద్యోగాలు పోయాయి. ఆ మాస్టర్ స్ట్రోక్కు ఆరేళ్లయ్యాక ఇప్పుడు.. 2016లో కంటే ప్రజల వద్ద 72శాతం అధికంగా నగదు ఉంది’’ అని ఖర్గే వివరించారు.
తాజాగా రిజర్వుబ్యాంక్ లెక్కల ప్రకారం ప్రజల వద్ద రూ.30.88 లక్షల కోట్లు నగదు ఉంది. 2016 నవంబర్ 4వ తేదీ నాటి బ్యాంక్ డేటా ప్రకారం అప్పట్లో ప్రజల వద్ద రూ.17.7 లక్షల కోట్ల నగదు ఉంది. ప్రజల వద్ద ఉన్న నోట్లు, చిల్లర నాణేలను నగదుగా లెక్కలోకి తీసుకొంటారు. ప్రతి 15 రోజులకోసారి ఆర్బీఐ చలామణిలో ఉన్న నగదు వివరాలను అందిస్తుంటుంది. బ్యాంకుల్లో ఉన్న నగదును మినహాయించిన తర్వాతే చలామణిలో ఉన్న నగదును వెల్లడిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం