Karnataka Cabinet Expansion: 29మందితో బొమ్మై కొత్త టీమ్.. యడ్డీ తనయుడికి దక్కని చోటు!
కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం తర్వాత బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ......
బెంగళూరు: కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం తర్వాత బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రెండు పర్యాయాలు దిల్లీ పర్యటనకు వెళ్లి భాజపా అధిష్ఠాన పెద్దలతో చర్చించి తర్జనభర్జనల అనంతరం బొమ్మై.. 29 మందితో కొత్త జట్టును ఎంపిక చేశారు. వీరందరితో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాజ్భవన్లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటల తర్వాత ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త కేబినెట్లో యడియూరప్ప తనయుడు విజయేంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఈ జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం.
ప్రమాణస్వీకారానికి ముందు యడియూరప్పని కలిసిన దృశ్యం..
కొత్త మంత్రులు వీరే..
2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహంతో కొత్త మంత్రుల జాబితాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో గోవింద్ కర్జోల్, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక, బి. శ్రీరాములు, వి.సోమన్న, ఉమేశ్ కత్తి, ఎస్.అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, సీఎన్ అశ్వథ్నారాయణ, సీసీ పటేల్, ఆనంద్ సింగ్, కోట శ్రీనివాస పూజారి, ప్రభు చౌహాన్, మురుగేశ్ నిరానీ, శివరామ హెబ్బార్, ఎస్టి సోమేశేఖర్, బీసీ పటేల్, బీఏ బసవరాజ, డాక్టర్ కె.సుధాకర్, కె. గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారాయణ గౌడ, బీసీ నగేశ్, వి. సునీల్ కుమార్, హాలప్ప ఆచార్, శంకర పాటిల్ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు.
పాత, కొత్త ముఖాల కలయికతో..
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా, నడ్డా మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రజలకు ప్రజానుకూల పాలనను అందించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ కేబినెట్ను ఎంపిక చేసినట్టు సీఎం బొమ్మై మీడియాకు వెల్లడించారు. అనుభవజ్ఞులతో పాటు కొత్త ముఖాల కలయికతో ఈ కేబినెట్ రూపుదిద్దుకున్నట్టు చెప్పారు. మొత్తంగా 29 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు ఆయన ఈ ఉదయం తెలిపారు.
మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఇలా..
సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో పెద్ద వర్గమైన లింగాయత్లకుపెద్ద పీట వేశారు. బొమ్మై జట్టులో ఎనిమిది మంది లింగాయత్ వర్గానికి చెందినవారికి కేబినెట్లో చోటు కల్పించగా.. ఒక్కళిగల నుంచి ఏడుగురు , ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజికవర్గం నుంచి ముగ్గురు, ఎస్టీ నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, మహిళల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట