Gudivada: గుడివాడలో వైకాపా కవ్వింపు చర్యలు.. ఉద్రిక్తత
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న తెదేపా-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
గుడివాడ గ్రామీణం: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా-జనసేన, వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎన్టీఆర్కు నివాళులర్పించేందుకు వస్తున్న తెదేపా-జనసేన కార్యకర్తలు, నాయకులపై వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. గుడివాడ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో కొంతసేపటికి ఉద్రిక్తత సద్దుమణిగింది.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెదేపా ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి కోరారు. ఉదయం 11.30 గంటలకు పోలీసులు వారికి సమయం ఇచ్చారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నివాళులర్పించేందుకు ఆ పార్టీ నేతలు బయలుదేరారు. ఈ క్రమంలో తెదేపా-జనసేన, వైకాపా కార్యకర్తలు పరస్పరం ఎదురుపడ్డారు. కొడాలి నాని సమక్షంలోనే వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో తోపులాట జరిగింది. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోవడంతో ఇరువర్గాలు శాంతించాయి. అనంతరం తెదేపా నేతలు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు.
అంతకుముందు పోలీసులు తెదేపా ర్యాలీని అరగంట అడ్డుకున్నారు. పోలీసులతో వాదనకు దిగి తమకు అనుమతిచ్చిన సమయంలోనే ర్యాలీ నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు పట్టుబట్టారు. కొడాలి నానికి అనుమతి ఇచ్చి.. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని తెదేపా-జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఆ వైఖరిని నిరసిస్తూ వెనిగండ్ల రాము రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్కు నివాళులర్పించి తీరుతామని తేల్చిచెప్పారు. ఎన్నికల కోసం కొడాలి నాని పన్నే కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
‘‘ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే తిట్టిన కొడాలి నానికి ఆయన పేరు తలచే అర్హత కూడా లేదు. యూట్యూబ్లో వ్యూస్ కోసం పాకులాడే వ్యక్తిగా నాని మారారు. గుడివాడలో వైకాపా పనైపోయింది. సాయంత్రం నిర్వహించే ‘రా.. కదలి రా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం తగదు. ఈ ప్రభుత్వం మరో రెండు నెలలు మాత్రమే ఉంటుందని గుర్తించి పోలీసులు పనిచేయాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతం చేసి తీరుతాం’’ అని రాము చెప్పారు. ‘రా.. రా కదలి రా..’ సభ ఏర్పాట్లలో ఉన్న తమ కార్యకర్తలపై దాడి చేసి అడ్డుకోవాలనే కుట్రతో వైకాపా కవ్వింపు చర్యలకు దిగుతోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా