Vijayawada: విజయవాడ వైకాపాలో ‘త్రీ ఇడియట్స్‌’: తెదేపా నేతల విమర్శ

విజయవాడ వైకాపాలో దేవినేని అవినాష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు ‘త్రీ ఇడియట్స్‌’లా ఉన్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. 

Published : 20 Aug 2023 16:44 IST

విజయవాడ: విజయవాడ వైకాపాలో దేవినేని అవినాష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు ‘త్రీ ఇడియట్స్‌’లా ఉన్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.  వెల్లంపల్లి శ్రీనివాస్‌ దుర్గగుడిలో లింగాలు మింగాడు కాబట్టే మంత్రి పదవి పోయిందని విమర్శించారు. నిన్న విజయవాడలో జరిగిన లోకేష్‌ పాదయాత్ర చూసి వైకాపా నాయకులకు మతిపోయిందని ఎద్దేవా చేశారు. వందమంది జగన్‌లు వచ్చినా  చంద్రబాబు విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. వైఎస్‌కు భయపడి కొడాలి నాని, జగన్‌కు భయపడి దేవినేని అవినాష్‌ పారిపోయారని దుయ్యబట్టారు. వచ్చే ఆరు నెలల్లో వైకాపా అడ్రస్‌ గల్లంతవడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీనియర్‌ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా హెచ్చరించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ .. లోకేశ్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని