Atchannaidu: ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత ఎప్పుడైనా చూశామా?: అచ్చెన్న
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైకాపాపై విముఖత పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
మంగళగిరి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైకాపాపై విముఖత పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. వైకాపా సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై ఎస్సీల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనకు వైకాపా సమాధానం చెప్పేలా.. బస్సు యాత్రకు వచ్చే వైకాపా నేతలపై ఒత్తిడి తేవాలని నేతలు స్పష్టం చేశారు. నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైకాపాకు గుర్తు చేయాలన్నారు. రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైకాపా బస్సు యాత్ర చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ‘‘ ఎస్టీలవి 29 పథకాలు, మైనారిటీలవి 11 పథకాలు రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత ఎప్పుడైనా చూశామా? ఇన్ని అక్రమాలు ఎప్పుడైనా చూశామా? ఇన్ని అరాచకాలపై జగన్ను ప్రశ్నించే ధైర్యం ఏ మంత్రికైనా ఉందా?’’ అని అచ్చెన్న నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా