Andhra News: జగన్ పాలనలో వైకాపా నేతలు కూడా సంతోషంగా లేరు: వంగలపూడి అనిత

సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు సర్వసాధారణమయ్యాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు

Updated : 31 Jan 2022 12:10 IST

అమరావతి: సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు సర్వసాధారణమయ్యాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలు, మద్యపాన నిషేధం, నిత్యావసరాల ధరల పెంపు, డ్వాక్రా సంఘాల నిర్వీర్యం తదితర అంశాలపై వైకాపా ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘నారీ సంకల్ప దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ జగన్‌ పాలనలో వైకాపా నేతలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. మహిళల్లో ధైర్యం నింపేందుకే సంకల్ప దీక్ష చేపట్టామని.. జగన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు. హోంమంత్రి సుచరిత నిస్సహాయ మంత్రి అని అనిత ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని