UP Polls: ‘6 యాత్రలతో ప్రజల్లోకి వెళ్తాం.. 300+ స్థానాల్లో గెలుస్తాం..’
ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆరు యాత్రల్ని చేపట్టాలని నిర్ణయించింది. ....
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆరు యాత్రల్ని చేపట్టాలని నిర్ణయించింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. 2022లో జరగబోయే ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఆరు యాత్రలతో ప్రజలకు చేరువ కానున్నట్టు స్వతంత్ర దేవ్ సింగ్ అన్నారు. పార్టీ కార్యకర్తల బలం, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో భాజపా 300లకు పైగా స్థానాలు గెలుచుకొని తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ట్విటర్లో విశ్వాసం వ్యక్తంచేశారు. మరోవైపు, ఈ ఆరు యాత్రల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలను ప్రజలకు వివరించనున్నట్టు మరో నేత తెలిపారు. ఈ యాత్రలకు సంబంధించిన ఇతర వివరాల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు.
2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా భాజపా పరివర్తన్ యాత్రల పేరుతో నాలుగు యాత్రలు చేపట్టింది. అప్పట్లో అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. భయం, అవినీతిలేని యూపీని చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలకు గాను భాజపా 312 స్థానాలతో భారీ విజయాన్ని అందుకోగా.. ఆ పార్టీ మిత్రపక్షాలు మరో 13స్థానాల్ని గెలుచుకున్నాయి.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం