Revanth reddy: రైతుల పట్ల భాజపా అమానుషంగా ప్రవర్తిస్తోంది: రేవంత్
యూపీలోని లఖింపుర్ భేరి ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు
హైదరాబాద్: యూపీలోని లఖింపుర్ ఖేరి ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్లో రైతులపై జరిగిన దుర్మార్గాన్ని ఎందుకు ఖండించలేదని నిలదీశారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. 80 కోట్ల మంది రైతుల జీవితాల మీద మోదీ, అమిత్ షా మరణ శాసనం రాశారని ఆరోపించారు.
‘‘దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారు. రైతుల పట్ల భాజపా అమానుషంగా ప్రవర్తిస్తోంది. గాంధీ స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భాజపా ఎంపీ కుమారుడు దారుణంగా ప్రవర్తించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో మోదీ, యోగి విఫలమయ్యారు. రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పతి పాలన విధించాలి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. అజయ్మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సహాయం చేస్తాం. ఉత్తర్ప్రదేశ్కి మా కమిటీ వెళ్లి సహాయం చేస్తుంది’’ అని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు వీహెచ్, సీతక్క తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు