AP politics: రఘువీరా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ కలయిక
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఒకప్పుడు జేసీ సోదరులు, రఘువీరారెడ్డ..
మడకశిర: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఒకప్పుడు జేసీ సోదరులు, రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ సోదరులు తెదేపాలో చేరగా.. రఘువీరారెడ్డి కాంగ్రెస్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత రఘువీరా పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పలు సందర్భాల్లో జేసీ ప్రభాకర్రెడ్డి, రఘువీరా మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అయితే, గత కొన్నేళ్లుగా రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్వగ్రామం నీలకంఠాపురంలోనే ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జేసీ ప్రభాకర్రెడ్డి... రఘువీరారెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది.
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డిని తాడిపత్రి మన్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఆత్మీయంగా కలిశారు. గ్రామంలో రఘువీరా కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన ఆలయాలను రఘువీరాతో కలిసి సందర్శించారు. అనంతరం స్వామివారి పూజ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పార్టీ జెండాతో కాకుండా కేవలం అజెండాతో మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా రాయలసీమలోని అందరు నాయకులను కలుస్తున్నట్టు చెప్పారు. ఈ అజెండాలో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. అందులో భాగంగానే రఘువీరారెడ్డిని కలిశానని, ఆయన నిర్మించిన దేవాలయాలను దర్శించుకున్నాని చెప్పారు. రాయలసీమ నీటి విషయంలో అజెండా గురించి వివరించారని.. ఆయన పూర్తిగా విన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రఘువీరా నిర్ణయం వెలువడుతుందని ప్రభాకర్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం