Governer Tamilisai: ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి నియామకంపై నిర్ణయం తీసుకోలేదు: తమిళిసై

తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ..

Updated : 30 Sep 2022 14:48 IST

హైదరాబాద్: తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ తమిళిసై అన్నారు. కౌశిక్‌రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సు చేసిందని ఆమె చెప్పారు. ఆ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్‌ తెలిపారు. సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి ఇటీవల తెరాసలో చేరిన కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మంత్రివర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని