TS News: సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. సేంద్రియ సాగు ప్రోత్సహాకాలపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2017-18 నుంచి మూడేళ్లుగా పథకం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. 584 క్లస్టర్లు, 29,200 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ సాగు అభివృద్ధి చేశామన్నారు. బడ్జెట్లో సేంద్రియ సాగుకు రూ.72 కోట్లు కేటాయించి రూ.25.98 కోట్లు వ్యయం చేశామని వివరించారు. రసాయన కూరగాయలు తినవద్దనే అవగాహన ప్రజల్లో పెరిగిందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ పరిధిలో మూడేళ్లలోనే 26వేల మిద్దె తోటలు పెరగడమే అందుకు నిదర్శమని వెల్లడించారు. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం ఎనబాదిలో మహిళలు 150 నుంచి 200 ఎకరాల్లో సేంద్రియ కూరగాయలు పండిస్తున్నారని సహజ పేరుతో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తనకు 37 ఎకరాల్లో సర్టిఫైడ్ అర్గానిక్ తోట ఉందని మండలిలో చెప్పడంతో ప్రజాపతినిధులకు మరింత అవగాహన కల్పించాలని ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి మంత్రికి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.