TS News: సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

రాష్ట్రంలో సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు.

Updated : 07 Oct 2021 15:09 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. సేంద్రియ సాగు ప్రోత్సహాకాలపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2017-18 నుంచి మూడేళ్లుగా పథకం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. 584 క్లస్టర్లు, 29,200 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ సాగు అభివృద్ధి చేశామన్నారు. బడ్జెట్‌లో సేంద్రియ సాగుకు రూ.72 కోట్లు కేటాయించి రూ.25.98 కోట్లు వ్యయం చేశామని వివరించారు. రసాయన కూరగాయలు తినవద్దనే అవగాహన ప్రజల్లో పెరిగిందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ పరిధిలో మూడేళ్లలోనే 26వేల మిద్దె తోటలు పెరగడమే అందుకు నిదర్శమని వెల్లడించారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం ఎనబాదిలో మహిళలు 150 నుంచి 200 ఎకరాల్లో సేంద్రియ కూరగాయలు పండిస్తున్నారని సహజ పేరుతో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. తనకు 37 ఎకరాల్లో సర్టిఫైడ్ అర్గానిక్‌ తోట ఉందని మండలిలో చెప్పడంతో ప్రజాపతినిధులకు మరింత అవగాహన కల్పించాలని ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి మంత్రికి సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని