Revanth reddy: మూడుచింతలపల్లి దళితవాడలో రేవంత్‌రెడ్డి రాత్రిబస

మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది.

Updated : 12 Oct 2022 15:42 IST

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆ గ్రామంలోనే బస చేశారు. మూడుచింతలపల్లి దళితవాడలోని బూరుగు సాయిలు (ఇందిరమ్మ) ఇంట్లో  రేవంత్‌రెడ్డి రాత్రి బస చేశారు. కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని రేవంత్‌ సవాల్‌ విసిరారు. మూడు చింతలపల్లిలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని