సుప్రీం తీర్పుతోనైనా జగన్‌ మారాలి: గోరంట్ల

అమరావతి భూముల కొనుగోళ్ల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పుతోనైనా

Updated : 20 Jul 2021 13:39 IST

అమరావతి: అమరావతి భూముల కొనుగోళ్ల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం జగన్‌ మారాలని అని తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్‌ తక్షణమే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో తప్పిదాలు చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నారన్నారని ఆక్షేపించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది?జగన్‌ తప్పిదాల కారణంగా ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి’’ అని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని