Raghurama: బెయిల్‌ బ్యాచ్‌ నీతులు వల్లిస్తోంది: రఘురామ

బెయిల్‌ బ్యాచ్‌ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు.

Updated : 27 Jul 2021 15:18 IST

దిల్లీ: బెయిల్‌ బ్యాచ్‌ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా తేలిన ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటికొస్తాయని తెలిపారు.

తనపై వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రఘురామ అన్నారు. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహహింస కేసు వేసిందని చెప్పారు. అతనిపై గృహహింస కేసులో ఛార్జ్‌షీట్‌ నమోదైందని రఘురామ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని