TS News: దేశ వ్యాప్తంగా భాజపా ఎవరికోసం పనిచేస్తోంది?: కొప్పుల ఈశ్వర్
తెరాస పేదల కోసం పనిచేస్తోందని.. దేశ వ్యాప్తంగా భాజపా ఎవరికోసం పనిచేస్తుందో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. తెరాస
హైదరాబాద్: తెరాస పేదల కోసం పనిచేస్తోందని.. దేశ వ్యాప్తంగా భాజపా ఎవరికోసం పనిచేస్తుందో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసుకుంటూ పోతున్నారు, ప్రైవేటు పరం అయితే బడుగు వర్గాలకు రిజర్వేషన్లు లభిస్తాయా? అని నిలదీశారు. దమ్ముంటే.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేసి చూపించాలని భాజపాకు సవాల్ విసిరారు. ప్రజల కోసం పనిచేస్తున్న తెరాస ప్రభుత్వంపై భాజపా బురదజల్లుతోందని మండిపడ్డారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో భాజపా ఎవరికి కొమ్ము కాస్తుందో చెప్పాలన్నారు. ఉన్నత వర్గాల కోసం, అదానీ, అంబానీల కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పనిచేస్తోందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్