Ongole: విషెష్‌ చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదని మంత్రి సురేశ్‌పై వైకాపా నేతల అసహనం

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ఓ వర్గానికి చెందిన వైకాపా నేతలు అసహనానికి గురయ్యారు.

Published : 01 Jan 2024 15:49 IST

ఒంగోలు: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై వైకాపాలోని ఓ వర్గానికి చెందిన నేతలు అసహనానికి గురయ్యారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్యాంపు ఆఫీసులో వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు కొండెపి, యర్రగొండపాలెం నుంచి పలువురు వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండెపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండలం అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి తన వర్గంతో కలిసి క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే, మంత్రిని కలిసేందుకు వారికి అవకాశం కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన రవికుమార్ రెడ్డి వర్గం.. మంత్రి తీరును తీవ్రంగా తప్పుపడుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొండెపి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా వచ్చిన మంత్రి సురేశ్‌.. పార్టీకి చెందిన అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని