ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఉద్ధృతం చేద్దాం

రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో విజయవాడలో మే ఒకటిన నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Published : 28 Apr 2022 06:04 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో విజయవాడలో మే ఒకటిన నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన గోడపత్రికను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఉద్ధృతం చేయడానికి ఈ సభను ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని