కరోనాతో కుమారుడి మృతి.. కోడలికి దగ్గరుండి రెండో పెళ్లి

కరోనాతో భర్తను పోగొట్టుకున్న మహిళకు.. ఆమె అత్తామామలే తల్లిదండ్రులుగా మారి మరో వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పెళ్లి చేయించడమే కాకుండా

Published : 14 May 2022 09:43 IST

రోనాతో భర్తను పోగొట్టుకున్న మహిళకు.. ఆమె అత్తామామలే తల్లిదండ్రులుగా మారి మరో వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పెళ్లి చేయించడమే కాకుండా మరణించిన తమ కుమారుడి ఇంటినీ కోడలికి రాసి ఇచ్చేశారు. ధార్‌ జిల్లాకు చెందిన రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి యుగ్‌ప్రకాశ్‌ తివారి కుమారుడు ప్రియాంక్‌ తివారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్‌ తివారికి భార్య ప్రియాంక, తొమ్మిదేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. ప్రియాంక్‌ మృతితో వీరంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త,మామ ఆలోచించారు. ఆమెను తమ సొంత కూతురిలా భావించి.. మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అక్షయతృతియ రోజున నాగ్‌పుర్‌లో ప్రియాంకకు వివాహం చేశారు. కోడలికి తల్లిదండ్రులుగా మారి దగ్గరుండి వేడుకలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని