
ఈ నెల 24 వరకు 55 ప్యాసింజరు రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. ఈ నెల 24 వరకు ఈ బండ్లు అందుబాటులో ఉండవని వెల్లడించింది. ఈ మేరకు సంస్థ సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పుష్ పుల్ రైలు రద్దుతో ప్రయాణికుల అవస్థలు
కాజీపేట, న్యూస్టుడే: కాజీపేట-సికిందరాబాద్ మధ్య 07757, 07758 నంబర్లతో నడిచే పుష్పుల్ రైలును శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో శుక్రవారం ఉదయం సికిందరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు ఈ సమాచారం తెలియక ఇబ్బందులు పడ్డారు. ఉదయం కాజీపేట స్టేషన్కు వచ్చిన ప్రయాణికులకు సమాచార కేంద్రం వద్ద రద్దు బోర్డు కనిపించడంతో ఆందోళన చెందారు. ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎక్కువ రుసుములు చెల్లించి వెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.