Asia Cup 2023: జట్టులో అతడు లేకపోవడం ఆశ్చర్యకరం.. నా బెస్ట్ పార్ట్నర్ మాత్రం కోహ్లీనే!
సీనియర్ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఆసియా కప్ (Asia Cup 2023) బరిలోకి టీమ్ఇండియా (Team India) దిగబోతోంది. దీనిపై నిరుత్సాహం వ్యక్తం చేసిన ఏబీ డివిలియర్స్.. టీ20ల్లో విరాట్ కోహ్లీతో కలిసి ఆడాలని ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) కోసం బరిలోకి దిగే భారత జట్టులోకి కొత్త ఆటగాడు తిలక్ వర్మ వచ్చాడు. గాయాలతో పోరాడి కోలుకుని వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్కూ చోటు దక్కింది. కానీ, స్పెషలిస్ట్ స్పిన్నర్ జాబితాలో మాత్రం చాహల్ను (Chahal) కాదని కుల్దీప్ను తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పందించాడు. చాహల్ను పక్కన పెట్టడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. అలాగే ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు విరాట్ కోహ్లీనే (Virat Kohli) తన సరైన జోడీగా అభివర్ణించాడు.
‘‘చాహల్ను పక్కన పెట్టారు. ఎవరిని తీసుకోవాలనే దానిపై స్పష్టతతోనే సెలెక్టర్లు ఉన్నారని భావిస్తున్నా. అయితే, జట్టు ఎంపిక మాత్రం నాకు కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. యుజ్వేంద్ర చాహల్ ఎప్పుడూ జట్టును గెలిపించగల బౌలర్. ఇలాంటి లెగ్ స్పిన్నర్ జట్టులో ఉండాల్సింది. అతడి నైపుణ్యాలు అద్భుతం. ఆర్సీబీ తరఫున ఉన్నప్పుడు చాహల్ బౌలింగ్ను ప్రత్యక్షంగా చూశా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగలిగే సత్తా అతడికుంది.
పెద్ద టోర్నీల్లో డెబ్యూ వద్దు.. వారిద్దరికీ చోటు లేదు.. సచిన్-ధోనీ సమానమే!
దక్షిణాఫ్రికా తరఫున ఆడేటప్పుడు హషీమ్ ఆమ్లాతో కలిసి బ్యాటింగ్ చేయడం ఆస్వాదించేవాడిని. మేమిద్దరం చాలాసార్లు అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మించాం. ఇక టీ20, ఐపీఎల్లో అయితే నాకెంతో ఇష్టమైన జోడీ విరాట్ కోహ్లీనే. మా ఇద్దరి ఆటతీరు ఒక్కోసారి ఢీకొట్టుకున్నట్లు ఉన్నప్పటికీ ఒకేలా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రత్యర్థి నుంచి వెంటనే మ్యాచ్ను తీసుకోవాలని కోరుకుంటాం. అందుకే, పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన బ్యాటింగ్ భాగస్వామి మాత్రం విరాట్ కోహ్లీనే అని చెప్పగలను. ఒక్కోసారి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. అలాంటప్పుడు అతడు లేదా నేను ఔటైనప్పటికీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లడానికి వెనుకాడం. ఒకవేళ ఆర్సీబీ 30/3 స్థితిలోనూ మేమిద్దరం ఐదో గేర్ వేసి మరీ పరుగులు రాబట్టేందుకు ముందుకెళ్తాం. ఇలా మేమిద్దరం భారీ భాగస్వామ్యాలతో పరుగులు రాబట్టిన సందర్భాలు కోకొల్లలు’’ అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.