Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ (ICC) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో సిరాజ్ (Siraj) అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో సిరాజ్పై ఏబీ డివిలియర్స్ (ABD) ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు ఆసీస్తో తొలి వన్డేలో షమీ (Shami) ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫెరెన్స్ సందర్భంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు షమీ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. షమీ ప్రదర్శనను మాజీ క్రికెటర్లు అభినందిస్తూనే ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
సిరాజ్.. నీ యాటిట్యూడ్ మార్చుకోవద్దు: ఏబీ డివిలియర్స్
ఆసియా కప్ ఫైనల్లో అద్భుత స్పెల్తో శ్రీలంకను గడగడలాడించిన సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సిరాజ్ ఆటలో పెద్ద సానుకూలాంశం అతడి యాటిట్యూడ్. ఇప్పటికే చాలాసార్లు దాని గురించి మాట్లాడా. అతడీ స్థాయికి వచ్చాడంటే దానికి కారణం కూడా ఆటపట్ల ఉండే ప్యాషన్. అందుకే, ఎప్పుడూ దాన్ని వదులుకోవద్దని చెబుతా. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలడు. అభిమానులు కూడా నీ నుంచి ఇదే ఆశిస్తారు. ఇలా గౌరవం పొందే బౌలర్లను ఏ జట్టూ వదులుకోదు. ప్రతి బంతికి వికెట్ తీయాలనే పట్టుదల సిరాజ్లో కనిపించింది’’ అని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
ఎవరికీ అలా ఉండాలని ఉండదు: షమీ
భారత జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంటుందని సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. తాజాగా ఆసీస్పై తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ‘తుది జట్టులో అవకాశం రానప్పుడు ఎలా ఫీల్ అవుతారు?’ అని ప్రెస్ కాన్ఫెరెన్స్లో ఓ రిపోర్టర్ ప్రశ్నకు షమీ సమాధానం ఇచ్చాడు. ‘‘రిజర్వ్ బెంచ్పై కూర్చోవడం ఎలాంటి ఆటగాడికైనా ఇబ్బందే. నేను తరచూ తుది జట్టులో ఉండి ఆడుతుంటే, తప్పకుండా మరొకరు ఆ ఛాన్స్ను మిస్ అవుతారు. అప్పుడు నాకేమీ అనిపించకపోయినా.. రిజర్వ్ బెంచ్పై ఉన్న వారు బాధపడతారు. అయితే, జట్టు విజయం సాధించినప్పుడు మనం రిజర్వ్ బెంచ్పై ఉన్నా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే జట్టు కాంబినేషన్ కీలకం. ప్రతిసారి తుది జట్టులో ఉండకపోవచ్చు. టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికను బట్టి ఫైనల్ XIలో ఎవరు ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మిగతావారికి మద్దతుగా నిలవాలి. అందుకే, ఎప్పుడు ఎలాంటి పాత్రను పోషించడానికైనా నేను సిద్ధంగా ఉంటా. రొటేషన్పై కోచ్ నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితిని బట్టి జట్టును మారుస్తూ ఉండటం సహజమే’’ అని షమీ తెలిపాడు.
ఇప్పటికీ షమీని తక్కువగానే అంచనా వేస్తారు: కైఫ్, ఉతప్ప
ఆసీస్పై తొలి వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమీని భారత మాజీ ఆటగాళ్లు మహమ్మద్ కైఫ్, రాబిన్ ఉతప్ప ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా అభివర్ణించారు. ఈ మేరకు ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) వేదికగా స్పందించారు. ‘‘ఐదు వికెట్ల ప్రదర్శనకు కంగ్రాట్స్. కానీ, ఇప్పటికీ మహమ్మద్ షమీ బౌలింగ్ను తక్కువగా అంచనా వేస్తుంటారు. అయితే, నా వరకైతే మాత్రం అతడు వరల్డ్ కప్ హీరో. షమీని విస్మరిస్తే మాత్రం ప్రత్యర్థులకు కష్టమే’’ అని కైఫ్ ట్వీట్ చేశాడు.
‘‘ఆసీస్పై టీమ్ఇండియా బ్యాటింగ్ అద్భుతం. ఓపెనర్లు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్ ఫినిష్ చేసేశారు. అంతకుముందు షమీ తన బౌలింగ్ సత్తా ఏంటో మరోసారి చూపించాడు. వరల్డ్ కప్ ముందు అన్నీ మంచి శకునాలే’’ అని రాబిన్ ఉతప్ప ట్విటర్ వేదికగా పోస్టు పెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు
దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును (IND vs SA) బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు ముగ్గురిని సారథులుగా నియమించింది. -
MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్
మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ (MS Dhoni)పై దక్షిణాఫ్రికా మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో మూడు సీజన్లు ఆడే సత్తా ధోనీకి ఉందని అంచనావేశాడు. -
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిశ్ నెహ్రాను (Ashish Nehra) టీమ్ఇండియా కోచింగ్ పదవి వరించినా.. వద్దని చెప్పడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. -
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
Rahul Dravid: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర కోచింగ్ బృంద కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించింది. దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. -
Rahul Dravid: ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
Dravid: మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
Rohit Sharma: మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన