Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ (ICC) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో సిరాజ్ (Siraj) అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో సిరాజ్పై ఏబీ డివిలియర్స్ (ABD) ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు ఆసీస్తో తొలి వన్డేలో షమీ (Shami) ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫెరెన్స్ సందర్భంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు షమీ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. షమీ ప్రదర్శనను మాజీ క్రికెటర్లు అభినందిస్తూనే ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
సిరాజ్.. నీ యాటిట్యూడ్ మార్చుకోవద్దు: ఏబీ డివిలియర్స్
ఆసియా కప్ ఫైనల్లో అద్భుత స్పెల్తో శ్రీలంకను గడగడలాడించిన సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సిరాజ్ ఆటలో పెద్ద సానుకూలాంశం అతడి యాటిట్యూడ్. ఇప్పటికే చాలాసార్లు దాని గురించి మాట్లాడా. అతడీ స్థాయికి వచ్చాడంటే దానికి కారణం కూడా ఆటపట్ల ఉండే ప్యాషన్. అందుకే, ఎప్పుడూ దాన్ని వదులుకోవద్దని చెబుతా. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలడు. అభిమానులు కూడా నీ నుంచి ఇదే ఆశిస్తారు. ఇలా గౌరవం పొందే బౌలర్లను ఏ జట్టూ వదులుకోదు. ప్రతి బంతికి వికెట్ తీయాలనే పట్టుదల సిరాజ్లో కనిపించింది’’ అని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
ఎవరికీ అలా ఉండాలని ఉండదు: షమీ
భారత జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంటుందని సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. తాజాగా ఆసీస్పై తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ‘తుది జట్టులో అవకాశం రానప్పుడు ఎలా ఫీల్ అవుతారు?’ అని ప్రెస్ కాన్ఫెరెన్స్లో ఓ రిపోర్టర్ ప్రశ్నకు షమీ సమాధానం ఇచ్చాడు. ‘‘రిజర్వ్ బెంచ్పై కూర్చోవడం ఎలాంటి ఆటగాడికైనా ఇబ్బందే. నేను తరచూ తుది జట్టులో ఉండి ఆడుతుంటే, తప్పకుండా మరొకరు ఆ ఛాన్స్ను మిస్ అవుతారు. అప్పుడు నాకేమీ అనిపించకపోయినా.. రిజర్వ్ బెంచ్పై ఉన్న వారు బాధపడతారు. అయితే, జట్టు విజయం సాధించినప్పుడు మనం రిజర్వ్ బెంచ్పై ఉన్నా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే జట్టు కాంబినేషన్ కీలకం. ప్రతిసారి తుది జట్టులో ఉండకపోవచ్చు. టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికను బట్టి ఫైనల్ XIలో ఎవరు ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మిగతావారికి మద్దతుగా నిలవాలి. అందుకే, ఎప్పుడు ఎలాంటి పాత్రను పోషించడానికైనా నేను సిద్ధంగా ఉంటా. రొటేషన్పై కోచ్ నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితిని బట్టి జట్టును మారుస్తూ ఉండటం సహజమే’’ అని షమీ తెలిపాడు.
ఇప్పటికీ షమీని తక్కువగానే అంచనా వేస్తారు: కైఫ్, ఉతప్ప
ఆసీస్పై తొలి వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమీని భారత మాజీ ఆటగాళ్లు మహమ్మద్ కైఫ్, రాబిన్ ఉతప్ప ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా అభివర్ణించారు. ఈ మేరకు ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) వేదికగా స్పందించారు. ‘‘ఐదు వికెట్ల ప్రదర్శనకు కంగ్రాట్స్. కానీ, ఇప్పటికీ మహమ్మద్ షమీ బౌలింగ్ను తక్కువగా అంచనా వేస్తుంటారు. అయితే, నా వరకైతే మాత్రం అతడు వరల్డ్ కప్ హీరో. షమీని విస్మరిస్తే మాత్రం ప్రత్యర్థులకు కష్టమే’’ అని కైఫ్ ట్వీట్ చేశాడు.
‘‘ఆసీస్పై టీమ్ఇండియా బ్యాటింగ్ అద్భుతం. ఓపెనర్లు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్ ఫినిష్ చేసేశారు. అంతకుముందు షమీ తన బౌలింగ్ సత్తా ఏంటో మరోసారి చూపించాడు. వరల్డ్ కప్ ముందు అన్నీ మంచి శకునాలే’’ అని రాబిన్ ఉతప్ప ట్విటర్ వేదికగా పోస్టు పెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు