T20 World Cup: పెద్ద ఆటగాళ్లపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి: కపిల్దేవ్
టీ20 ప్రపంచకప్లో టీమిండియా దారుణంగా విఫలమవుతోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్లతో జరిగిన మ్యాచ్ల్లో ఓడిన భారత్ సెమీస్ రేసులో చాలా వెనుకబడింది. మిగిలిన మూడు మ్యాచ్ల్లో నెగ్గినా భారత్ సెమీస్కు చేరడం కష్టమే.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో టీమిండియా దారుణంగా విఫలమవుతోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్లతో జరిగిన మ్యాచ్ల్లో ఓడిన భారత్ సెమీస్ రేసులో చాలా వెనుకబడింది. మిగిలిన మూడు మ్యాచ్ల్లో నెగ్గినా భారత్ సెమీస్కు చేరడం కష్టమే. టీమిండియా తదుపరి దశకు అర్హత సాధించాలంటే అఫ్గానిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఇది సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. దీంతో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న పెద్ద ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకుని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇతర జట్ల ఫలితాలమీద ఆధారపడి సెమీస్ చేరడం అనేది మంచిది కాదని పేర్కొన్నారు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టుగా రాణించకపోతే వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైందని కపిల్దేవ్ అన్నారు.
‘సెమీస్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం అనేది భారత్కు మంచిది కాదు. ప్రపంచకప్ని విజేతగా నిలవడం గానీ, సెమీస్కు చేరడం గానీ సొంత బలంతో జరగాలి. నా అంచనా ప్రకారం జట్టులోని పెద్ద ఆటగాళ్ల భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం ఆటగాళ్లను తయారు చేయాలంటే ఐపీఎల్లో రాణించిన యువ క్రికెటర్లని జట్టులోకి తీసుకునే అంశంపై సెలక్టర్లు ఆలోచించాలి. ఒకవేళ యువ క్రికెటర్లతో కూడిన జట్టు ఓడినా ఎలాంటి నష్టం ఉండదు. పైగా వారికి అనుభవం వస్తుంది. కానీ, పెద్ద ఆటగాళ్లు రాణించకపోతే చాలా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే అంశంపై ఆలోచించాలి’ అని కపిల్దేవ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!