Milkha singh: ఇకపై మెరిసే స్ప్రింటర్లలో కనిపించేది మీరే!
భారత పరుగుల వీరుడు ‘మిల్కా సింగ్’ కన్నుమూయడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. ఆయన ఇక లేరన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ప్రముఖులు అంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు....
మిల్కాసింగ్కు ప్రముఖుల నివాళి
ఇంటర్నెట్ డెస్క్: భారత పరుగుల వీరుడు ‘మిల్కా సింగ్’ కన్నుమూయడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. ఆయన ఇక లేరన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ప్రముఖులు అంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం మిల్కాసింగ్కు కరోనా సోకింది. దాన్నుంచి ఆయన కోలుకున్నప్పటికీ తదనంతర సమస్యలు ఇబ్బంది పెట్టాయి. శుక్రవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో రాత్రి 11:30 గంటలకు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
* క్రీడా దిగ్గజం మిల్కాసింగ్ లేరని తెలిసి నా హృదయం బాధతో నిండిపోయింది. ఆయన ఎదుర్కొన్న కష్టాలు, చూపించిన తెగువ రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా సానుభూతి. - రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
* దేశం ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై మిల్కాసింగ్ దేశం ఖ్యాతిని ఇనుమడింపజేశారు. లెక్కలేనంత మంది భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన విజయాలతో కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. కొన్ని రోజుల క్రితమే ఆయనతో మాట్లాడాను. ఆయనతో సంభాషించడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదు. ఆయన జీవితం నుంచి ఎంతోమంది క్రీడాకారులు ప్రేరణ పొందుతారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - ప్రధాని నరేంద్రమోదీ
* ది ఫ్లయింగ్ సిఖ్, మిల్కాసింగ్ మరణం దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ప్రపంచ అథ్లెటిక్స్లో ఆయన చెరగని ముద్ర వేశారు. భారత అత్యంత ప్రముఖ క్రీడాకారుడిగా దేశం ఆయనను గుర్తు పెట్టుకుంటుంది. - కేంద్ర హోం మంత్రి అమిత్ షా
* భారత్ ఒక తారను కోల్పోయింది. మిల్కాసింగ్ మనల్ని వదిలి వెళ్లినా దేశం కోసం తపన పడే ప్రతి ఆటగాడికీ ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. - కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు
* మిల్కాసింగ్ మరణించారని తెలిసి కుంగిపోయాను. ఒక శకం ముగిసింది. భారత్, పంజాబ్ ఈ రోజు విషాదంలో మునిగిపోయాయి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. రాబోయే ప్రతి తరంలో ఫ్లయింగ్ సిఖ్ కనిపిస్తూనే ఉంటారు. రెస్టిన్ పీస్ సర్! - పంజాబ్ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్
* మిల్కాసింగ్ మాకెంత ఇష్టమో, మా తరానికి ఆయనంటే ఎంత విలువో ఎలా వివరించగలం? ఆయన కేవలం ఓ క్రీడాకారుడే కాదు. సామ్రాజ్యవాద తదనంతరం అభద్రతతో బాధపడుతున్న సమాజం.. ప్రపంచంలోనే అత్యున్నతమైందని చెప్పేందుకు ఆయన ఉదాహరణగా నిలిచారు. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మిల్కాసింగ్ జీ - ఆనంద్ మహీంద్రా
* ఫ్లయింగ్ సిఖ్ సర్దార్ మిల్కాసింగ్ లేరని తెలిసి గుండెపగిలింది - హర్భజన్ సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!