Ruturaj Gaikwad: సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మెగా టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును సమం చేశాడు. గత రాత్రి హైదరాబాద్తో
(Photo: Ruturaj Instagram)
ఇంటర్నెట్డెస్క్: చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మెగా టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును సమం చేశాడు. గత రాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు.
ఆదివారం రాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 6వ ఓవర్లో జన్సెన్ వేసిన తొలి బంతికి సిక్స్ కొట్టి రుతురాజ్ ఈ మెగా టోర్నీలో 1000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 31 మ్యాచ్ల్లోనే వెయ్యి పరుగులు సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు సచిన్ పేరుపై ఉన్న రికార్డును రుతురాజ్ సమం చేశాడు. వీరిద్దరి తర్వాత సురేశ్ రైనా (34 మ్యాచ్లు), రిషభ్ పంత్ (35 మ్యాచ్లు), దేవదత్ పడిక్కల్ (35 మ్యాచ్లు) అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన వారి జాబితాలో ఉన్నారు.
ఈ ఏడాది మెగా టోర్నీలో ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన రుతురాజ్.. నిన్నటి మ్యాచ్లో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ కాన్వేతో కలిసి 182 పరుగుల అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 57 బంతుల్లో 99 పరుగులు సాధించి తృటిలో శతకాన్ని కోల్పోయాడు. మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడుతూ.. ‘‘సొంత గ్రౌండ్లో పెద్ద స్కోరు చేయడం ఎప్పటికీ ప్రత్యేకమే. శతకం కోల్పోయినందుకు కాస్త బాధగా ఉన్నప్పటికీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. 99 అయినా 100 అయినా జట్టు గెలుపొందడమే చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్