Mohammed Siraj : అప్పుడు రూమ్లో కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్
భారత్ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని తన తండ్రి కోరుకున్నాడని యువ పేసర్ సిరాజ్ (Siraj) తెలిపాడు. ఆ కల కోసమే తండ్రి చనిపోయినా తాను స్వదేశానికి రాకుండా ఆసీస్లోనే ఉండిపోయానంటూ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.
ఇంటర్నెట్డెస్క్ : టీమ్ఇండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రి చనిపోయినప్పుడు.. తాను ఎదుర్కొన్న పరిస్థితులను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్(IPL)లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్.. ఆర్సీబీ(RCB) సీజన్ 2 పాడ్కాస్ట్లో మాట్లాడాడు. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు.
2020 నవంబర్లో సిరాజ్ ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్నప్పుడు అతడి తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ బయోబబుల్లో ఉండటంతో.. అతడు తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేకపోయాడు. కన్న తండ్రి చివరి చూపు కూడా దక్కకపోవడంతో తాను ఎన్నోసార్లు ఒంటరిగా రూమ్లో కూర్చుని ఏడ్చానని సిరాజ్ చెప్పాడు. ‘‘క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో ఆటగాళ్లు ఒకరి రూమ్లోకి మరొకరు వచ్చేవారు కాదు. వీడియో కాల్స్లోనే మాట్లాడుకునే వాళ్లం. ఆ పరిస్థితుల్లో అప్పటి ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ నాకు ఫోన్ చేసి.. ఎలా ఉన్నావంటూ అడిగేవాడు. నాకు కాబోయే భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడుతూ అండగా నిలిచింది. అయితే.. ఫోన్లో ఎప్పుడూ నేను ఏడవలేదు. రూమ్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడిని. ఆ తర్వాత ఆమెతో మాట్లాడేవాడిని’’ అంటూ ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు సిరాజ్.
‘‘తండ్రి చనిపోయిన తర్వాతి రోజే నేను ట్రైనింగ్ సెషన్కు వెళ్లాను. ఆ సమయంలో రవిశాస్త్రి నాకు ధైర్యం చెప్పారు. ‘నీకు నీ తండ్రి ఆశీస్సులు ఉన్నాయి. నువ్వు ఐదు వికెట్లు తీసుకుంటావు’ అని చెప్పాడు. బ్రిస్బేన్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయగానే.. శాస్త్రి నా వద్దకు వచ్చి.. ముందే చెప్పానుగా.. అని అన్నాడు’’ అంటూ సిరాజ్.. తనకు రవిశాస్త్రి అండగా ఉన్న క్షణాలను వివరించాడు.
క్రికెట్ ఆడే సమయంలో తన తండ్రితో గడిపిన క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోనని.. తానో గొప్ప క్రికెటర్ కావాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారని సిరాజ్ చెప్పాడు. ‘‘నేను ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించాను. ఎందుకంటే.. ప్రధాన బౌలర్లంతా గాయపడటంతో.. నేను పేస్ అటాక్లో లీడర్గా మారాను. కొత్త బంతితో బౌలింగ్ చేయడం భిన్నమైన అనుభూతి కలిగించింది’ అని సిరాజ్ వివరించాడు. ఆ ఏడాది బాక్సింగ్ డే టెస్టుతో సిరాజ్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో ఈ పేసర్ సత్తా చాటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.