సంక్షిప్త వార్తలు (3)
జాతీయ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు జోరు చూపించారు.
పారా క్రీడల్లో ‘లక్ష్య’ అథ్లెట్ల జోరు
ఈనాడు, హైదరాబాద్: జాతీయ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు జోరు చూపించారు. గుజరాత్లో జరిగిన ఈ పోటీల్లో 6 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక కాంస్యంతో సహా మొత్తం 12 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో చిన జీయర్ స్వామి నేత్ర విద్యాలయా (విశాఖపట్నం) క్రీడాకారులు పది పతకాలు సాధించారు. 100 మీ, 1500 మీ పరుగులో లలిత 2 స్వర్ణాలు; 100 మీ, షాట్పుట్లో రవ్వాణి 2 స్వర్ణాలు గెలుచుకున్నారు. మణికంఠ.. 100 మీ పరుగులో స్వర్ణం, లాంగ్జంప్లో రజతం సాధించాడు. షాట్పుట్లో స్వర్ణం నెగ్గిన అక్షయ అనురాధ.. 100 మీ పరుగులో రజతం గెలిచింది. 100 మీ పరుగులో గౌతమ్ రజతం, షాట్పుట్లో సూర్య రోహిత్ కాంస్యం నెగ్గారు. శ్రీకాకుళానికి చెందిన లోకేశ్.. హైజంప్, లాంగ్జంప్లో రజత పతకాలు సాధించాడు.
థాయ్లాండ్ ఓపెన్కు సాత్విక్ జోడీ దూరం
బ్యాంకాక్: భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజు-చిరాగ్శెట్టి, మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, మాళవిక బాన్సోద్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగారు. ‘‘సాత్విక్ గాయం నయమవలేదు. అందుకే థాయ్లాండ్ ఓపెన్లో ఆడట్లేదు. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్పై దృష్టిసారిస్తాం’’ అని చిరాగ్ తెలిపాడు. మంగళవారం ప్రారంభమయ్యే థాయ్లాండ్ ఓపెన్లో సాయి ప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాంశు రజావత్, కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్, అనుపమ ఉపాధ్యాయ, అష్మిత చాలిహా, గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ, సిక్కిరెడ్డి- శ్రుతి మిశ్రా, అశ్విని-తనీషా, సుమీత్రెడ్డి- అశ్విని, రోహన్ కపూర్- సిక్కి, ఇషాన్- తనీషా బరిలో ఉన్నారు.
ఖేలో ఇండియాతో జట్టుకట్టిన ఎస్ఎఫ్ఏ
ఈనాడు, హైదరాబాద్: భారత భవిష్యత్తు ఛాంపియన్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఖేలో ఇండియా మిషన్తో స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) జట్టుకట్టింది. దేశంలో క్రీడాభివృద్ధి కోసం రానున్న అయిదేళ్లలో రూ.12.5 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రాల్లో ఖేల్ ఇండియా కేంద్రాల అభివృద్ధి, ప్రతిభాన్వేషణ, మహిళా క్రీడలు, దివ్యాంగ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతో సహా 12 అంశాలపై ఎస్ఎఫ్ఏ దృష్టిసారించనుంది. దేశంలో క్షేత్ర, అట్టడుగు స్థాయిలో అన్ని క్రీడల్ని పటిష్ట పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘‘అట్టడుగు స్థాయిలో క్రీడలకు అండగా నిలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. 2015 నుంచి దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఏ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టోర్నీలు నిర్వహించింది. భారత్లో క్రీడా సంస్కృతి పెంపొందించడం కోసం ఖేలో ఇండియా మిషన్తో చేతులు కలపడం ఆనందంగా ఉంది. క్షేత్ర స్థాయిలో క్రీడాభివృద్ధి కోసం ఎస్ఎఫ్ఏ కృషిచేస్తుంది. వచ్చే మూడేళ్లలో 20 రాష్ట్రాల్లో 15 లక్షల మంది చిన్నారులకు పోటీలు నిర్వహిస్తాం’’ అని ఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకుడు రిషికేశ్ జోషి తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు