Afg vs Nz: మ్యాచ్‌కి ముందు భారత క్యురేటర్‌ మోహన్‌ మృతి

అబుదాబి క్రికెట్‌ స్టేడియంలో చీఫ్‌ క్యురేటర్‌గా ఉన్న భారత్‌కు చెందిన మోహన్‌ సింగ్‌ మృతి చెందాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందే అతడు విగత జీవిగా

Published : 08 Nov 2021 08:04 IST

అబుదాబి: అబుదాబి క్రికెట్‌ స్టేడియంలో చీఫ్‌ క్యురేటర్‌గా ఉన్న భారత్‌కు చెందిన మోహన్‌ సింగ్‌ మృతి చెందాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందే అతడు విగత జీవిగా కనిపించాడు. అతడి మెడకు ఉరి ఉన్నట్లు అబుదాబి క్రికెట్‌ అధికారి చెప్పాడు. మోహన్‌ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన 45 ఏళ్ల మోహన్‌కు అబుదాబి క్రికెట్‌తో 15 ఏళ్ల అనుబంధం ఉంది. కివీస్‌-అఫ్గాన్‌ మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు అతడు మైదానంలోకి వచ్చి పిచ్‌ను పరిశీలించాడు కూడా. గత కొన్ని నెలలుగా అతడు కుంగుబాటుతో బాధపడుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని