
యువ భారత్ బోణీ
అండర్-19 ప్రపంచకప్
జార్జ్టౌన్: రికార్డు స్థాయిలో అయిదో సారి అండర్-19 ప్రపంచకప్ను దక్కించుకునే దిశగా యువ భారత్ తొలి అడుగు వేసింది. శనివారం గ్రూప్- బి మ్యాచ్లో పటిష్ఠమైన దక్షిణాఫ్రికాపై భారత కుర్రాళ్లు 45 పరుగుల తేడాతో గెలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ యశ్ ధుల్ (82; 100 బంతుల్లో 11×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను ఆంధ్ర కుర్రాడు రషీద్ (31)తో కలిసి యశ్ ఆదుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్కు 71 పరుగులు జోడించింది. ప్రత్యర్థి బౌలర్లలో మాథ్యూ (3/40), అఫివె (2/29), డెవాల్డ్ (2/43) ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో స్పిన్నర్ విక్కీ (5/28), పేసర్ రాజ్ బవా (4/47) ధాటికి దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ (65; 99 బంతుల్లో 6×4, 2×6) మాత్రమే రాణించాడు. ఛేదనలో డెవాల్డ్ పోరాటంతో ప్రత్యర్థి ఓ దశలో 138/3తో లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ గొప్పగా రాణించిన భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.