విశాఖ నుంచి తరలిన మ్యాచ్
వెస్టిండీస్తో టీ20 మ్యాచ్ను ఆస్వాదిద్దామనుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు బీసీసీఐ చేదువార్త చెప్పింది. కరోనా విజృంభణ నేపథ్యంలో విశాఖపట్నంలో జరగాల్సిన మ్యాచ్ను తరలించింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరిగే పరిమిత
దిల్లీ: వెస్టిండీస్తో టీ20 మ్యాచ్ను ఆస్వాదిద్దామనుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు బీసీసీఐ చేదువార్త చెప్పింది. కరోనా విజృంభణ నేపథ్యంలో విశాఖపట్నంలో జరగాల్సిన మ్యాచ్ను తరలించింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ను రెండు నగరాలకే పరిమితం చేసింది. వైరస్ నేపథ్యంలో జట్లకు ప్రయాణ భయం ఉండకూడదనే కారణంతో నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ప్రకటించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం విండీస్తో టీమ్ఇండియా ఆడాల్సిన మూడు వన్డేలు అహ్మదాబాద్లో, టీ20లు కోల్కతాలో జరుగుతాయి. వచ్చే నెల 6, 9, 11 తేదీల్లో వన్డేలు, 16, 18, 20 తేదీల్లో టీ20లను బీసీసీఐ నిర్వహిస్తుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వన్డేలు వరుసగా అహ్మదాబాద్, జైపుర్, కోల్కతాలో.. టీ20లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో జరగాల్సింది. 18న విశాఖలో టీ20 ఉండాల్సింది. కానీ మహమ్మారి వల్ల మ్యాచ్లను రెండు వేదికలకే పరిమితం చేయక తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్