ముగిసిన ప్రఫుల్ పటేల్ కథ
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను నడిపించడానికి సుప్రీంకోర్టు బుధవారం పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించింది. దీంతో పదవీకాలానికి మించి రెండేళ్లు అధికారంలో కొనసాగిన అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ కథ ముగిసింది.
ఏఐఎఫ్ఎఫ్కు పాలకుల కమిటీ
దిల్లీ: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను నడిపించడానికి సుప్రీంకోర్టు బుధవారం పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించింది. దీంతో పదవీకాలానికి మించి రెండేళ్లు అధికారంలో కొనసాగిన అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ కథ ముగిసింది. పాలకుల కమిటీకి విశ్రాంతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్ ఆర్ దవే నాయకత్వం వహిస్తారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషీ, భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ భాస్కర్ గంగూలీ కమిటీలోని ఇతర సభ్యులు. జాతీయ క్రీడా నియమావళిని అనుసరించి రూపొందించిన ఏఐఎఫ్ఎఫ్ నూతన రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించాల్సివుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగి, కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు సీఓఏ.. ఫుట్బాల్ సమాఖ్య వ్యవహరాలు చూస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..